విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. 2024 ధరల ప్రకారం డీపీఆర్ల తయారీ పూర్తయ్యింది. విజయవాడ నగరంలో రెండు దశల్లో 3 కారిడార్ల పనులు, విశాఖపట్నంలో రెండు దశల్లో 4 కారిడార్లు పనులు చేపట్టాలని డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 6 ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.