వైసీపీ క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చిన జగన్ లాస్ట్ పంచ్.. కామెంట్స్ వైరల్-ys jagan comments at the press meet went viral on social media ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వైసీపీలో ఇద్దరే శాశ్వతం..

గతంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాజీమంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. ‘వైసీపీలో ఇద్దరే శాశ్వతం.. లీడర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ.. జెండా మోసే కార్యకర్త, జగన్.. ఈ ఇద్దరే పార్టీలో పర్మనెంట్’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నాని చేసిన ఈ కామెంట్స్, జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు జోడించి చేసిన వీడియోలు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు నిజమేనని.. వైసీపీలో ఈ ఇద్దరే శాశ్వతం అని క్యాడర్ చెబుతున్నారు.

Source link