చనిపోయిన చిరుతల వయసు రెండేళ్లు ఉంటుందని చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చని డిఎఫ్ఓ అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్లకు పంపుతున్నట్లు చెప్పారు. రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగం లేదా విషాహారం తినడం, ఏదై వ్యాధి సోకి మృతి చెందాయా అనేది పరీక్షల్లో తేలుతుందని చెప్పారు. చిరుత కూనల్ని కోల్పోయిన తల్లి ఆవేశంగా ఉంటుందని స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.