పాత గదులతో పాటు అదనంగా రెండు తరగతి గదులను నిర్మించారు. స్కూల్లో బోర్ వేయించారు. విద్యార్దులకు డైనింగ్ రూం, బాలికలు, బాలురు, సిబ్బందికి వేర్వేరుగా మరుగుదొడ్లు, వాష్ ఏరియా అందుబాటులోకి వచ్చాయి. నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటు చేశారు. పాఠశాలకు వసతులు సమకూరడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓక్రిడ్జ్ స్కూల్ నుంచి తమ బడికి ప్రతి శనివారం తమ విద్యార్థులను తీసుకొచ్చి పాఠాలు బోధించే వారని, హిమాన్షు ఇక్కడి సమస్యలను చూసి నిధులను సమీకరించడంతో నెల రోజుల్లోనే పనులు పూర్తయ్యాయని ప్రధానోపాధ్యాయుడు రాములు చెప్పారు.