తూర్పు గోదావరిలో ఉన్న పంచారామాలు
తూర్పుగోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి సామర్లకోటలో కుమార భీమారామం, మరొకటి రామచంద్రాపురానికి సమీపంలో ద్రాక్షారామం. సామర్లకోటలో ఉన్న కుమార భీమారామం క్షేత్రంలో కుమారస్వామి స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టంచారని ప్రతీక. అందువల్ల కుమారారామమని పిలుస్తారు. చాళుక్య రాజు భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల కుమారభీమారామంగా పేరు గాంచింది. చైత్ర, వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయం సమయంలో స్వామివారి పాదాలనీ, సాయంత్రపు వేళలల్లో అమ్మవారి పాదాలను తాకుతాయి. దీన్ని ఇక్కడి విశేషంగా భావిస్తారు.