రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరానికి బ్రేకులు పడినట్లు అయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా ప్రకటన వస్తుందని అంతా భావించారు. ఈ ఫిబ్రవరి మాసంలోనే ఎన్నికల నిర్వహణ తప్పనిసరిగా ఉంటుందని అనుకున్నప్పటికీ… చివరి నిమిషంలో సీన్ మారిపోయింది. కుల గణనపై మరోసారి ప్రభుత్వం ప్రకటన చేయటంతో… ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది.