సంయుక్తంగా బంద్కు పిలుపు..
ఆదివాసీ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే వైసీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ రాజకీయ పార్టీలతో పాటు.. గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగుల సంఘం, మహిళ సంఘాలు, ఆదివాసీ జేఏసీ, ఆదివాసీ సంఘాలు బంద్కు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ బంద్ ఏజెన్సీ ప్రాంతమైన మన్యం పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, అనకాపల్లి జిల్లాల్లో కొంత ప్రాంతంలో ఉంటుంది. వేలాది మంది గిరిజన, ఆదివాసీ ప్రజలు బంద్లో పాల్గొననున్నట్లు ఆయా సంఘాల నేతలు వెల్లడించారు.