కుట్రకోణం లేదంటున్న ఎన్ఐఏ
విశాఖ ఎయిర్పోర్టు లాంజ్లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్పై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఎయిర్పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ ఇటీవల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు నమోదు చేసిన ఎన్ఐఏ కోర్టు, సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తుంది. ఈ కేసును గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ చేశారు. ఇటీవల కేసు విచారణను విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో పాటు నిందితుడు శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు.