హైకోర్టులో సీఎం జగన్ కు ఊరట, కోడికత్తి కేసు విచారణపై స్టే-vijayawada cm jagan petition high court stay order on kodi kathi case inquiry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

కుట్రకోణం లేదంటున్న ఎన్ఐఏ

విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్‌పై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ కోర్టు, సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తుంది. ఈ కేసును గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ చేశారు. ఇటీవల కేసు విచారణను విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో పాటు నిందితుడు శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు.

Source link