India vs Pakistan: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల్లోనే కాదు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే క్రేజ్ మరో లెవెల్లో ఉంటుంది. రెండు టీమ్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు చాలా ఏళ్ల నుంచి లేకపోవటంతో ఐసీసీ టోర్నీలతో పాటు ఆసియా కప్లో మాత్రమే తలపడుతున్నాయి. అందుకే ఏ ఐసీసీ టోర్నీలో టీమిండియా, పాక్ తలపడినా ఈ మ్యాచ్ కోసమే ఎందరూ ఎదురుచూస్తుంటారు. ఇక భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీలోనూ భారత్, పాకిస్థాన్ ఢీకొననున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.