రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు 40,345 ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 31,158గా ఉంది. అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో 19,11,699 ఓట్లతో అనంతపురం నియోజకవర్గం ఉండగా, రెండవ స్థానంలో 19,12,049 ఓట్లతో కర్నూలు నియోజకవర్గం, మూడవ స్థానంలో 18,98,533 ఓట్లతో నెల్లూరు నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు.