అర్చకులు, అధ్యాపకులకు గుడ్ న్యూస్, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!-andhra pradesh cm jagan cabinet approves sipb project crda r5 zone house construction key decisions

కేబినెట్ కీలక నిర్ణయాలివే

అసైన్డ్‌ ల్యాండ్‌ పొందిన లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు అనుభవించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇతర రైతుల మాదిరిగానే భూమి క్రయవిక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయని పేర్కొంది. మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌మెంట్‌ భూములు, లంక భూములలో.. 66,111 మందికి పూర్తి హక్కులు కేటాయిస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1966 రెవెన్యూ గ్రామాల్లో ఎస్సీలకు ప్రత్యేక శ్మశాన వాటికలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ నిర్ణయిం తీసుకుంది. రాష్ట్ర విభజనకు ముందు ల్యాండ్‌ పర్చేజ్‌ స్కీమ్ కింద దళితులకు కేటాయించిన 16,213 ఎకరాలకు చెల్లించాల్సిన రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ​పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సీఆర్‌డీఏలో 47 వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. యూనివర్సీటీలో శాశ్వత అధ్యాపకుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచేందుకు కేబినెట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అర్చకులకు పదవీవిరమణ లేకుండా చట్టసవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేవాదాయశాఖ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జులైలో చేపట్టే పలు సంక్షేమ పథకాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Source link