ఇంటర్మీడియట్ పరీక్షల హాజరు విషయంలో ప్రవేశపెట్టిన నిమిషం నిబంధనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నిర్ణయంతో పలుచోట్ల విద్యార్థులు పరీక్షలు రాలేకపోయారు. ఫలితంగా ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాయలేకపోయామని కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరగాల్సి వచ్చింది. పరీక్షకు అనుమతించని కారణంతో మనస్తాపానికి గురైన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి మరణవార్త చర్చనీయాంశంగా మారింది. ఒక్క నిమిషం నిబంధనను సడలించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో… ఇంటర్ బోర్డు నిమిషం నిబంధనను సడలించింది.