భారీగా ధరలు పెంచేసి…
అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేశారు. దీంతో తెలంగాణ, కర్ణాటక, గోవా,హర్యానాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించింది. నాటుసారా వినియోగం గణనీయంగా పెరిగింది. అక్రమ రవాణాను నియంత్రించలేమని గుర్తించడంతో ధరల్ని దశల వారీగా తగ్గించారు. మరోవైపు ఏపీలో మద్యం విక్రయాలతో కళ్లు చెదిరే ఆదాయం వస్తుండటంతో పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఏపీతో సమానంగా ధరలు పెంచేశాయి. దీంతో అక్రమ రవాణాకు కాస్త అడ్డుకట్ట పడింది.