గోదావరి వరద ఉధృతి:
మరోవైపు గోదావరి వరద ఉద్ధృతి పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటిమట్టం 50.9 అడుగులుగా ఉంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులుగా ఉండగా… మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.