బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ భారత అథ్లెట్ల బృందానికి ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించారు. భారత అథ్లెట్లు టెడ్రిషనల్ డ్రెస్లలో ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళా అథ్లెట్లు చీరల్లో, పురుష అథ్లెట్లు కుర్తాలో కనిపించారు. 117 మందికి 78 మంది అథ్లెట్లు మాత్రమే ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. హాకీ టీమ్తోపాటు రెజర్లు, వెయిట్ లిఫ్టర్లకు ఈవెంట్స్ ఉండటంతో ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.