జులై 20న హెల్త్ సెక్రటరీ, డీఎంఈలకు, 29న డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు వినతిపత్రాలు అందించారు. వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. తాము ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కొత్త మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ పేరుతో సీట్లు కేటాయించడం సరికాదని నోటీసులో పేర్కొన్నారు.