అభం శుభం తెలియని చిన్నారి హత్యాచారానికి గురైంది. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగు చూసింది. చాక్లెట్లు ఇప్పిస్తానని వెంట తీసుకెళ్లి మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారం చేసి… ఆపై చంపేసి పూడ్చిపెట్టాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.