ByGanesh
Thu 28th Nov 2024 09:31 AM
2004 లో పెళ్లి చేసుకుని 18 ఏళ్ళ వివాహబంధంలో తలెత్తిన మనస్పర్ధలతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లిన హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యలకు చెన్నై ఫ్యామిలీ కోర్ట్ ఫైనల్ గా విడాకులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితమే తాము విడిపోతున్నట్టుగాప్రకటించిన ఈ జంటకు ఇప్పడు విడాకులొచ్చాయి.
ధనుష్-ఐశ్వర్యలు విడిపోతున్నట్టుగా ప్రకటించాక సూపర్ స్టార్ అభిమానులు మళ్ళీ వాళ్ళు కలవాలని కోరుకున్నారు. కానీ ధనుష్-ఐశ్వర్యలు విడిపోవడానికే మొగ్గు చూపించారు. కాకపోతే ధనుష్-ఐశ్వర్యలు పలుమార్లు కోర్టులో విచారణకు హాజవ్వలేదు. దానితో ధనుష్-ఐశ్వర్యలు పిల్లల కోసం కలిసిపోయారని అనుకున్నారు.
కానీ నిన్న బుధవారం ధనుష్-ఐశ్వర్య విడాకుల కేసు విచారణకు రాగా.. వీరిద్దరూ విడిపోవడానికే రెడీ అవ్వగా చెన్నై ఫ్యామిలీ కోర్టు ధనుష్ కి ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేసింది.
Dhanush and Aishwarya Rajinikanth granted divorce:
Dhanush and Aishwarya Rajinikanth are officially divorced