తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండపై ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.