దావోస్ లో ఏపీకి ప్రత్యేక స్టాల్ రిజర్వు
రాష్ట్రంలోని వనరులు, పెట్టుబడి అవకాశాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దావోస్ లో వివరించనున్నారు. రాష్ట్రంలో సాంకేతిక పాలన, పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో ఏపీలో ఉన్న అవకాశాలను దావోస్ లో పర్యటన సీఎం చంద్రబాబు వివరించనున్నారు. షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్ అనే థీమ్ తో ఈసారి దావోస్ లో ఏపీ ప్రభుత్వం ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ సదస్సులో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే స్టాల్ తో పాటు ఏపీకీ ఓ ప్రత్యేకంగా స్టాల్ రిజర్వు చేసింది కేంద్ర ప్రభుత్వం.