42 శాతం రిజర్వేషన్..
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్తో పాటు.. బీసీ సబ్ ప్లాన్ను తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీసీల అభివృద్దికి ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు చేస్తామని వాగ్ధానం చేసింది. ప్రతి జిల్లాకు బీసీ భవన్, అర్హులైన బీసీలకు రుణాలివ్వడం, ప్రతీ మండలానికి బీసీ గురుకులం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.