9 నుంచి సమ్మెలోకి….
ఉద్యోగ భద్రత, హక్కుల సాధనకు ఆర్టీసీ మేనేజ్మెంట కు ఎన్నోసార్లు విన్నవించామని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ కరీంనగర్ జిల్లా చైర్మన్ ఎంపీ రెడ్డి తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టిన హమీలను ఉల్లంఘిస్తూ ఆర్టీసీ ఆస్తులను బడాబాబులకు అప్పగించే ప్రయత్నాలు మానుకోవాలని కోరారు. 2021 పే స్కేల్ ఇవ్వాలని, కార్మికులను వేధించడం, గేట్మీటింగ్ ల ద్వారా యాజమాన్యం వేధించడం, భయబ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 9నుంచి సమ్మె చేయడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.