ByGanesh
Tue 18th Feb 2025 07:33 PM
పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కొడుకు అకీరా ను వెంట బెట్టుకుని స్నేహితుడు ఆనంద్ సాయి తో కలిసి కేరళ, తమిళనాడు దేవాలయాలను సందర్శించి స్పెషల్ పూజలు నిర్వహించారు. తమిళనాడు నుంచి నేరుగా విజయవాడ వెళ్లి అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ లో పాల్గొన్నారు.
ఇక ఈరోజు తన ఫ్రెండ్ త్రివిక్రమ్ తో కలిసి భార్య అన్న ను అలాగే కొడుకు అకీరా తో కలిసి ప్రయాగరాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లారు. మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్, ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ కలిసి పాల్గొన్నారు.
కుంభమేళా లో స్నానమాచరించిన పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ లు పూజలు నిర్వహించారు.
Pawan takes holy dip at Maha Kumbh:
AP Dy CM Pawan Kalyan visits Maha Kumbh