Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చి జెసిబి సహాయంతో తవ్వకాలు ప్రారంభించారు. గుర్తించిన గ్రామస్తులతో దురుసుగా ప్రవర్తించడంతో వారికి దేహశుద్ధి చేశారు.