షెడ్యూల్ ప్రకారం..
ఏపీపీఎస్సీ ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి 5న మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా పడింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా.. మొత్తం 899 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకటన 2023 డిసెంబర్లో వెలువడింది. గ్రూప్-2 నోటిఫికేషన్లో ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ల అంశాన్ని సవాల్ చేస్తూ.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. పరీక్షల నిర్వహణకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.