మార్చి నెలాఖరులోగా బిల్లులు మంజూరు చేయించుకోడానికి విఎంసిలో కార్పొరేటర్లు, కింది స్థాయి సిబ్బందితో కలిసి తాగునీటి సరఫరాలో అవంతరాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఏఈ స్థాయి అధికారుల పర్యవేక్షణలో చేయాల్సిన ఇంజనీరింగ్ పనుల్ని సచివాలయ సిబ్బందితో చేయిస్తుండటంతో మునిసిపల్ మంత్రికి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫిర్యాదు చేశారు.