అమరావతి ఎస్ఆర్ఎమ్ వర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ పి.సత్యనారాయణన్ మాట్లాడుతూ, “పరిశోధన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి, ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయంలో అధునాతన AI ల్యాబ్లను స్థాపించడానికి ఈ సహకారం మార్గం సుగమం చేస్తుంది” అని అన్నారు. ఈ ల్యాబ్ లు ఏఐ పరిశోధనకు ఇంక్యుబేటర్లుగా ఉంటాయి, విద్యాపరమైన, అంతర్-విభాగ సహకారం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందిస్తాయని ప్రో ఛాన్సలర్ తెలిపారు.