భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్. ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బరిలో దిగిన సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తక్కువ ర్యాంకు క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది. బుధవారం (మార్చి 12) సింధు 21-19, 13-21, 13-21 తేడాతో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది.