తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇవాళ ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా స్పీకర్ ను ఉద్దేశిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలను… కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. జగదీశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.