దీంతో కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వ భూముల గురించి, ఎల్కతుర్తి మండల అధికారులు, అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డితో చర్చించారు. క్యాంపస్ ఏర్పాటుకు స్థలాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కాగా రెండేళ్లలోనే క్యాంపస్ ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇదిలాఉంటే తొందర్లోనే హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అందుబాటులోకి రానుండటంతో రాష్ట్రంలో మరిన్ని సీట్లు పెరగనున్నాయి. దీంతో మరింత మంది విద్యార్థులకు సాంకేతిక విద్య చేరువ కానుంది.