ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టామని, కొన్ని లొసుగులను నిర్ధారించామని, పాత ఉద్యోగులపై విచారణ జరపడమే తమ ప్రధాన లక్ష్యమని, కొందరు ప్రస్తుత ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ చోరీపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి పలు రికార్డులను కూడా సేకరించారు. ఈ వ్యవహారంపై కియా కంపెనీ ప్రతినిధులు అధికారికంగా స్పందించలేదు.