గ్రేటర్ విశాఖ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అవిశ్వాస నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ఓవైపు కూటమి నేతలు వేగంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ఉండగా…. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.