చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బుధవారం బీభత్సం సృష్టించి దంపతుల్ని తొక్కి చంపేసిన ఒంటరి ఏనుగు గురువారం కూడా మరో మహిళను చంపేసింది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగును అటవీశాఖ అధికారులు పట్టుకునే లోపే తమిళనాడు సరిహద్దు గ్రామంలో మరో మహిళను చంపేసింది.