Bengal Panchayat Elections: బెంగాల్‌లో ముగిసిన రీపోలింగ్, రేపు బీజేపీ ఫ్యాక్ట్‌ ఫైండింగ్ టీమ్ ఎంట్రీ – దీటుగా మమత మరో ప్లాన్!

<p>పశ్చిమ బెంగాల్&zwnj; పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల వల్ల అక్కడ చాలా చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పోలింగ్&zwnj;పై ప్రభావం పడిన 19 జిల్లాల్లోని 697 బూత్&zwnj;లలో నేడు (జూలై 10) రీపోలింగ్&zwnj; నిర్వహించారు.</p>
<p><strong>జూలై 11న ఎన్నికల ఫలితాలు</strong></p>
<p>నేడు 696 బూత్&zwnj;లలో రీ పోలింగ్ నిర్వహించగా, అన్ని చోట్ల విజయవంతంగా పూర్తయింది. ఇక ఎన్నికల ఫలితాలు మంగళవారం (జూలై 11) వెల్లడి కానున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2023 పంచాయతీ ఎన్నికల చుట్టూ జరిగిన హింసాత్మకం చెలరేగింది. గత 33 రోజుల్లో బెంగాల్&zwnj;లో 40 మంది ఈ హింసాత్మక ఘటనల్లో చనిపోయారు.</p>
<p><strong>అమిత్ షాను కలిసిన గవర్నర్</strong></p>
<p>పశ్చిమ బెంగాల్&zwnj;లో శనివారం (జూలై 8) జరిగిన హింసాత్మక ఘటనలపై గవర్నర్ నివేదికను సిద్ధం చేసి అమిత్ షాకు సమర్పించారు. సోమవారం (జూలై 10), గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయి హింసపై నివేదిక సమర్పించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. జులై 8న పోలింగ్ రోజున 15 మంది మృతి చెందారని, పలువురు గాయపడినట్లు తెలుస్తోందని అన్నారు. పలు పోలింగ్ కేంద్రాలను కూడా ధ్వంసం చేశారని అన్నారు. చరిత్రలోనే ఇదొక చీకటి రోజని అన్నారు.</p>
<p><strong>బీజేపీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్ కోల్&zwnj;కతాకు</strong></p>
<p>బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందాన్ని పశ్చిమ బెంగాల్&zwnj;కు కేంద్రం పంపనుంది. ఇందులో ముగ్గురు బీజేపీ ఎంపీలు డాక్టర్ రాజ్&zwnj;దీప్ రాయ్, సత్యపాల్ సింగ్, రేఖా వర్మలు కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం మంగళవారం (జూలై 11) ఉదయం కోల్&zwnj;కతాకు చేరుకుంటుంది. పరిస్థితిని తెలుసుకోవడానికి హింసాత్మక ప్రాంతాలను సందర్శించనుంది. హింసాకాండపై నివేదికను సిద్ధం చేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అందజేసే బాధ్యతను ఈ ప్రతినిధి బృందానికి అప్పగించారు.</p>
<p><strong>పోటీగా మమత టీమ్ మణిపూర్ కు</strong></p>
<p>ఓవైపు పంచాయతీ ఓటింగ్ లో హింసాకాండ ఘటనలో కేంద్ర బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్రానికి వస్తుండగా.. <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a> &lsquo;ఫ్యాక్ట్&zwnj; ఫైండింగ్&zwnj;&rsquo; టీమ్&zwnj;కు దీటుగా తృణమూల్&zwnj; <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a>&zwnj; &lsquo;ఫాక్ట్&zwnj; ఫైండింగ్&zwnj;&rsquo; టీమ్&zwnj;ని మణిపూర్&zwnj;కు పంపుతోంది. ప్రస్తుతం అక్కడ అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎంపీలు డెరెక్, కళ్యాణ్, కకాలీ, డోలా సేన్ మణిపూర్&zwnj;లో తృణమూల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్&zwnj;లో ఉండనున్నారు.&nbsp;</p>

Source link