Char Dham Yatra 2025 Kedarnath Yatra from Telangana and Andhra Pradesh Full Trip Details in Telugu and Precautions to Take

Kedarnath Yatra Full Trip Details : చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2025)లో ప్రధానంగా నాలుగు ఆలయాలు ఉంటాయి. యమునోత్రి (Yamunotri), గంగోత్రి (Gangotri), కేదార్​నాథ్ (Kedarnath), బద్రీనాథ్ (Badrinath). ఈ నాలుగు ప్రదేశాలకు కామన్ పాయింట్ హరిద్వార్ అని చెప్పొచ్చు. ఈ నాలుగు ఆలయాలు దర్శించుకుంటే చార్ ధామ్ యాత్ర పూర్తి అవుతుంది. వీటిలో కష్టపడి చేరుకోవాల్సిన ఆలయం కేదార్​నాథ్. ఎందుకంటే సుదీర్ఘమైన ట్రెక్కింగ్ తర్వాతనే ఈ ఆలయాన్ని చేరుకోగలుగుతాము. మీరు కూడా ఈ సారి కేదార్​నాథ్​కి వెళ్లాలనుకుంటే తెలుగు రాష్ట్రాలనుంచి ఎలా వెళ్లొచ్చో.. ఈ చార్ ధాం యాత్రను ఎలా పూర్తి చేయొచ్చో ఇప్పుడు చూసేద్దాం.

చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి డైరక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. హైదరాబాద్ నుంచి అయినా, విశాఖపట్నం, విజయవాడ.. ఇలా ప్రదేశం నుంచి అయినా మీరు ఈ యాత్ర ప్రారంభించాలనుకుంటే డైరక్ట్​ ఢిల్లీ వెళ్లిపోవాల్సి ఉంటుంది. మీరు బుక్ చేసుకునే వాటిని బట్టి ఈ రైలు టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. ఢిల్లీ నుంచి నాలుగు ఆలయాలకు మెయిన్​ పాయింట్​ అయిన హరిద్వార్​కి ట్రైన్​లో వెళ్లొచ్చు. థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకుంటే 500 నుంచి 550 మధ్య ఉంటుంది. ఢిల్లీ నుంచి మీరు రిషికేష్​కి వెళ్లినా పర్లేదు. ఒకవేళ జర్నీ ఎక్కువ అవుతుందనుకునేవారు ఫ్లైట్​లో వెళ్లాలనుకుంటే.. చార్​ధాంకి దగ్గర పాయింట్ డెహ్రడూన్ ఎయిర్​పోర్ట్​కి కూడా వెళ్లొచ్చు. టైమ్ కలిసి వస్తుంది. కానీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. బడ్జెట్​లో వెళ్లాలనుకుంటే ట్రైన్ జర్నీ బెస్ట్. 

రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యం..

చార్​ధామ్ యాత్రకు వెళ్లేవారు కచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే.. రిజిస్ట్రేషన్. ఇది లేకుండా చార్​ ధామ్ యాత్ర చేయలేరు. ఈ ప్రాసెస్ ఆన్​లైన్, ఆఫ్​లైన్​లో కూడా అందుబాటులో ఉంటుంది. దూరం నుంచి వెళ్లేవారు ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మంచిది. కేదార్​ నాథ్​కి వెళ్లాలంటే హరిద్వార్ నుంచి సోనుప్రయాగ్​కి వెళ్లాలి. దీనికి బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఆఫ్​లైన్, ఆన్​లైన్​లో కూడా బుక్ చేసుకోవచ్చు. దీని ధర 500 ఉంటుంది. దాదాపు 8 గంటల జర్నీ ఉంటుంది. సోను ప్రయాగ్​లో హోటల్స్ ఉంటాయి. మీరు స్టే చేయవచ్చు. లేదంటే గౌరి కొండ​కి వెళ్లి అక్కడ స్టే చేయవచ్చు. అక్కడి నుంచి మీరు కేదార్​నాథ్​కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయవచ్చు. బడ్జెట్ తక్కువుంటే సోను ప్రయాగ్​లో బస చేయడమే మంచిది. 

ట్రెక్కింగ్ 

కేదార్​నాథ్​కి ట్రెక్కింగ్​ని ఆర్చ్​నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. దూరం 22 కిలోమీటర్లు ఉంటుంది. మూడు రకాలుగా ఈ ట్రెక్​ని కంప్లీట్ చేయొచ్చు. ఒకటి నడిచి వెళ్లొచ్చు. రెండు గుర్రాల సహాయంతో ట్రెక్ కంప్లీట్ చేయొచ్చు. మూడోది డోలి సహాయంతో వెళ్లొచ్చు. ఎక్కువదూరం ట్రెక్ చేయనివారికి నడక కంటే ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే స్పెషల్ హెలీకాప్టర్లు అందుబాటులో ఉంటాయి. వాటి ద్వారా కూడా కేదార్​నాథ్ వెళ్లొచ్చు. వీటిని కూడా ఆన్​లైన్​లో బుక్ చేసుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ట్రెక్​ చేస్తూ పైకి వెళ్లేవారు షూస్ వేసుకుంటే మంచిది. కంఫర్ట్​బుల్​గా ఉంటాయి. అలాగే ముఖ్యమైన లగేజ్​ని మరీ ఎక్కువ కాకుండా.. అవసరమైన వాటిని ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లాలి. నెక్స్ట్​ డే మార్చుకోవడానికి ఓ జత దుస్తులు కూడా తీసుకెళ్తే మంచిది. ఇలా ట్రెక్ ద్వారా ఆలయానికి చేరుకోవడానికి 7 నుంచి 8 గంటలు పడుతుంది. మధ్యలో క్యాంప్స్ ఉంటాయి. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. కేదార్​నాథ్​కి రీచ్ అయిన తర్వాత హోటల్స్​ లేదా టెంట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టే చేసి తర్వాత టెంపుల్​కి వెళ్లొచ్చు. 

అది మరచిపోకండి.. 

రిజిస్ట్రేషన్ డిటైల్స్ చూపిస్తే స్లిప్ ఇస్తారు. దీనితో దర్శనానికి వెళ్లిపోవచ్చు. అనంతరం భైరవ బాబా ఆలయాన్ని దర్శించుకుంటే కేదారనాథ్ యాత్ర కంప్లీట్ అవుతుంది. కేదారనాథ్ దర్శించుకున్న తర్వాత దీనిని కచ్చితంగా దర్శించుకోవాలని చెప్తారు. అనంతరం మీరు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను కూడా దర్శించుకుని చార్​ధాం యాత్రను ముగించుకోవచ్చు. లేదంటే కేదారనాథ్ యాత్ర ఒక్కటి కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయిపోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

Also Read : కేదార్​నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర​ ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే

మరిన్ని చూడండి

Source link