Delhi Results: తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బకొట్టినట్లుగానే ఢిల్లీలో కేజ్రీవాల్‌కు మోదీ, అమిత్ షా ద్వయం చెక్

<p>సామాన్యుడి పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నాలుగో సారి ఢిల్లీ పీఠం దక్కించుకునే విషయంలో బొక్క బొర్లా పడింది. &nbsp; జాతీయ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్&zwnj;కు చెందిన ఆప్ తీరు చాలా &nbsp;ఆకర్షించింది. ఢిల్లీ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాల్లో &nbsp;ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసరికి బీజేపీని ఎదుర్కొనే పార్టీగా ఓ దశలో చర్చసాగింది. &nbsp;అదే చర్చ &nbsp;ఆ పార్టీని కిందకు లాగి పడేసిందనే చెప్పాలి. &nbsp;జాతీయ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు సాగినా మోదీ, అమిత్ షా ద్వయం ముకుతాడు వేసే వ్యూహాలతో ఆ పార్టీని దించి పారేస్తోంది. ఇందుకు భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. &nbsp;</p>
<p>పదేళ్ల పాటు తెలంగాణలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోను అదే రీతిలో తన ప్రభావం చూపేందుకు మహారాష్ట్ర వేదికగా &nbsp;కార్యాచరణ ప్రారంభించారు. అంతే దీన్ని గుర్తించిన మోదీ- అమిత్ షా ద్వయం తెలంగాణ ఎన్నికల్లో &nbsp;బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా వ్యూహాలు పన్ని విజయవంతం చేశారన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా, మూడో దఫా కేసీఆర్ గెలవకుండా బీజేపీ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేసిందని, &nbsp;అదే అగ్రేసీవ్ గా బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసి ఉండే &nbsp;బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి తిరిగి <a title="కేసీఆర్" href="https://telugu.abplive.com/topic/kcr" data-type="interlinkingkeywords">కేసీఆర్</a> గద్దె నెక్కే అవకాశం ఉందన్నది వాస్తవమని మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి. &nbsp;</p>
<p>ఇది గమనించే బీజేపీ దూకుడు తగ్గించేందుకు గాను <a title="బండి సంజయ్" href="https://telugu.abplive.com/topic/Bandi-Sanjay" data-type="interlinkingkeywords">బండి సంజయ్</a> ను బీజేపీ రాష్ట్ర పీఠం నుండి దింపి, వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డికి అప్పగించిందని అదే &nbsp;కారు కొంప ముంచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ ప్రాంతీయ పార్టీ ఎదిగి జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించడం ఇప్పటి కిప్పుడు సాధ్యం కాదన్న పరిస్థితిని మోదీ- అమిత్ షా ద్వయం &nbsp;సృష్టించారనడంలో సందేహం లేదు.</p>
<p>&nbsp;<strong>ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు</strong></p>
<p><br />1. &nbsp;లిక్కర్ స్కాం – &nbsp;అవినీతిని నిర్మూలిస్తామన్న హమీతో &nbsp;ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వం ఆ పార్టీ హామీలు &nbsp;ఢిల్లీ ఓటర్లను ఆకర్షించాయి . అందుకే &nbsp;రెండు సార్లు &nbsp;ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దశాబ్దకాలంగా సాగిన కేజ్రీ వాల్ పాలనకు గండి కొట్టింది లిక్కర్. లిక్కర్ ప్రవాహంలో &nbsp;ఆ పార్టీ కొట్టుకొని పోయింది. &nbsp;ఈ స్కాంలో &nbsp;సీఎం కేజ్రీ వాల్, ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఢిల్లీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. అవినీతిపై సమరం చేసిన నాయకులే చివరకు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం &nbsp;ఆ పార్టీని నైతికంగా బాగా దెబ్బ తీసింది. &nbsp;ఈ ఎన్నికల్లో &nbsp;ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది &nbsp;ఒకటి.</p>
<p><br />2. హమీల అమలులో వైఫల్యం – &nbsp;ఢిల్లీ ఓటర్లకు ఆమ్ ఆద్మీ ఇచ్చిన ప్రధాన హామీల్లో వాయు కాలుష్యం తగ్గించడం, యమునా నదిని వందకు వంద శాతం శుద్ది చేస్తామని చెప్పారు. తాని ఈ రెండు హామీలను &nbsp;కేజ్రీవాల్ సర్కార్ నిలబెట్టుకోలేకపోయింది. సురక్షిత తాగు నీరు నల్లా కనెక్షన్ల ద్వారా అందిస్తానన్న హమీ నిలబెట్టుకోలేకపోయిదంి. అంతే కాకుండా ఢిల్లీ రోడ్లను &nbsp;యూరోపియన్ దేశాల్లోని రోడ్ల మాదిరి మారుస్తానని హామి ఇచ్చారు. ఇది నిలబెట్టుకోలేకపోయింది. &nbsp;ఇదే విషయాన్ని ఆప్ సారధి కేజ్రీ వాల్ తన ప్రచాంలోను చెప్పారు. ఈ మూడు హామీలు నిలబెట్టుకోలేకపోయనని చెప్పడం గమనార్హం. &nbsp;అంతే కాకుండా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి ఓటర్ పైన ప్రభావం చూపింది. &nbsp;ఈ కారణాల &nbsp;ఆమ్ ఆద్మీ పార్టీ &nbsp;చతికిల పడింది.</p>
<p>3. కాంగ్రెస్ తో వైరం – &nbsp;ఇండియా కూటమిలో భాగం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ల మధ్య వైషమ్యాలు ఈ ఎన్నికల్లో రెండు పార్టీలను దెబ్బ తీశాయి. కాంగ్రెస్ ఖాతా తెరవకుండా డకౌట్ కాగా &nbsp;ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని దూరం చేసుకుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు సిద్దమయ్యారు. &nbsp;ఇది తప్పని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. &nbsp;కాంగ్రెస్ – ఆప్ పార్టీల మధ్య గొడవలు &nbsp;విజయాన్ని దూరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు పడే &nbsp;ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టంది. దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు వెయి నుంచి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే <a title="కాంగ్రెస్" href="https://telugu.abplive.com/topic/Congress" data-type="interlinkingkeywords">కాంగ్రెస్</a> – &nbsp;ఆప్ కలిసి పోటీ చేస్తే <a title="బీజేపీ" href="https://telugu.abplive.com/topic/BJP" data-type="interlinkingkeywords">బీజేపీ</a>కి ఇంత సుళువుగా విజయం దక్కేది కాదు. తిరిగి ఆప్ పార్టీనే సర్కార్ ఏర్పాటు చేసే స్థితిలో ఉండేది.</p>
<p>&nbsp;</p>

Source link