Etala Rajender Security :ఈటలకు వై కేటగిరీ భద్రత

MLA Etala Rajender Security:బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ‘వై కేటగిరీ’ భద్రత కల్పించింది. ఈ మేరకు ఈటలకు భద్రత పెంచుతూ శుక్రవారం సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి ఈటలకు వై ప్లస్‌ కేటగిరీ భద్రత అమల్లోకి రానుంది. ఇటీవలే తనకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ… డీజీపీతో మాట్లాడారు. వివరాలు సేకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో…. గురువారం మేడ్చల్‌ డీసీపీ సందీప్‌ రావు ఈటలను కలిసి వివరాలు సేకరించారు. ప్రాణహానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న డీసీపీ సందీప్‌.. డీజీపీకి సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఈటలకు వై కేటగిరీ భద్ర కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Source link