GO 317 Problems : నష్టపోయిన ఉద్యోగుల వివరాలివ్వండి

317 జీవో వివాదం…!

గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చింది. రాష్ట్రంలో కొత్త జోన్ల వ్యవస్థ అమలులోకి రావటంతో.. కొత్త జిల్లాలకు, కొత్త జోన్లకు, మల్టీ జోన్లకు.. ఉద్యోగాలను, ఉద్యోగులను సర్దుబాటు చేసే ప్రక్రియను నాటి ప్రభుత్వం ప్రారంభించింది. 2021 డిసెంబర్ 6వ తేదీన ఈ జీఓను జారీ చేసింది. పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలోని ఉద్యోగులు.. ఆ పాత జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల పరిధిలోని కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లటానికి ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది.

Source link