ఈ ఘటన కాకినాడ రూరర్లోని తోట సుబ్బారావు నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చెందిన వానపల్లి చంద్రకిశోర్ కాకినాడలోని వాకలపూడిలోని ఓఎన్జీసీ ఆఫీసులో అసిస్టెంట్ అకౌంటెంట్గా పని చేస్తున్నాడు. నగరంలోని సుబ్బారావు నగర్లో ఓ ఫ్లాట్లో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య తనూజ, పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. జోషిల్ ఒకటో తరగతి, నిఖిల్ యూకేజీ చదువుతున్నాడు.