Kaleswaram: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం మహత్తర ఘట్టానికి సిద్ధమైంది. శుక్రవారం నుంచి కాళేశ్వర క్షేత్రంలో మహా కుంభాభిషేకం జరగనుంది. ఈ నెల 7న మాఘశుద్ధ దశమి శుక్రవారం నుంచి మాఘ శుద్ధ ద్వాదశి 9వ తేదీ ఆదివారం వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఇక్కడ జరగనున్నాయి.