Karimnagar : తెలంగాణలో పాలన భ్రష్టు పట్టిందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. సచివాలయంలో ఏఐసీసీ ఇంఛార్జ్ రివ్యూ చేయడం ఏంటని ప్రశ్నించారు. అవినీతి కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.