<p>Mann Ki Baat : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన 100వ రాకెట్‌ ప్రయోగం పూర్తి చేయడం గర్వకారణంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. అంతరిక్ష రంగం లో దేశం ఏటా పురోగతి సాధిస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని ఇస్రోకు అభినందనలు తెలియజేశారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని ఇస్రో, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమన్నారు.</p>
<p>ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్‌ ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. గిరిజన భాషలను పరిరక్షించడంలో సాయం చేశారంటూ కొనియాడారు. ఏఐను ఉపయోగించి కొలామి భాషలో కైలాష్ పాటను కంపోజ్‌ చేశారని ప్రధాని ప్రశంసించారు. </p>
<p><strong>పెరుగుతున్న ఏఐ వినియోగం</strong><br />ఏఐ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ అన్నారు. ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో నేడు ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ వినియోగం గురించి ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ఆయన అభినందించారు. అంతరిక్ష రంగంలో ప్రతి ఏటా సాధిస్తున్న పురోగతిని కొనియాడారు. ఇస్రో 100 వ రాకెట్‌ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేయడం దేశానికి గర్వకారణమన్నారు. అంతరిక్షశాస్త్ర సరిహద్దులను అధిగమించాలనే దేశ బలమైన సంకాల్పానికి ఈ కృషి నిదర్శనమన్నారు. 10ఏళ్లలో సుమారు 460 ఉపగ్రహాలను లాంచ్‌ చేసినట్లు తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రతేడాది కొత్త పురోగతి సాధిస్తున్నందుకు ఇస్రోను అభినందించారు. చంద్రయాన్‌ ప్రయోగం విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపాలన్నారు.</p>
<p>Also Read :<a title="Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి విశేషాలివే" href="https://telugu.abplive.com/telangana/nalgonda/revanth-reddy-participates-bangaru-vimana-gopura-maha-kumbhabhisheka-samprokshana-at-yadagirigutta-198820" target="_blank" rel="noopener">Revanth Reddy: యాదగిరిగుట్టలో బంగారు విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, పూర్తి విశేషాలివే</a> </p>
<p><strong>పెరుగుతున్న వారి భాగస్వామ్యం</strong><br /> ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడం ఇటీవలి విజయాలలో ఒకటి అని ఆయన అన్నారు. ఇటీవల నేను ఏఐ సదస్సులో పాల్గొనడానికి పారిస్ వెళ్ళాను. కృత్రిమ మేధస్సు రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించింది. ఇటీవల, తెలంగాణలోని ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ గిరిజన భాషలను పరిరక్షించడంలో మాకు సహాయం చేశాడు. AI సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో ఒక పాటను కంపోజ్ చేశానని మోదీ అన్నారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, వారి జీవితాలకు స్ఫూర్తినిచ్చేందుకు ఒక రోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికి అంకితం చేస్తానని ఆయన అన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో, రాజ్యాంగ రూపకల్పనలో మహిళల పాత్రను ఆయన ప్రశంసించారు.</p>
<p>Also Read :<a title="Hyderabad Metro Rail Corridor: ఎయిర్ పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి… గ్రీన్ కారిడార్ లో మెట్రో ఎండీ క్షేత్ర స్థాయి పరిశీలన" href="https://telugu.abplive.com/telangana/hyderabad/from-shamshabad-airport-to-future-city-in-40-minutes-green-corridor-metro-rail-passing-through-raviryala-198827" target="_blank" rel="noopener">Hyderabad Metro Rail Corridor: ఎయిర్ పోర్ట్ నుంచి 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి… గ్రీన్ కారిడార్ లో మెట్రో ఎండీ క్షేత్ర స్థాయి పరిశీలన</a></p>