Medaram Hundi Counting : మేడారం హుండీల్లో నకిలీ కరెన్సీ

గత జాతరకు 12 కోట్ల ఆదాయం

గత మేడారం జాతర 2022 లో ఆ సంవత్సరం 512 హుండీలు ఏర్పాటు చేశారు. ఆయా హుండీల్లో దాదాపు రూ.12 కోట్ల వరకు కానుకలు వచ్చాయి. ఈ సారి గత జాతర కంటే ఎక్కువ మంది భక్తులు తరలిరాగా.. హుండీల సంఖ్య కూడా పెంచారు. దీంతో ఈసారి హుండీల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే హుండీలో భక్తులు వేసిన ఒడిబియ్యం, కరెన్సీ నోట్లు, కాయిన్స్​ వేరు చేసేందుకు ఈసారి మూడు మెషీన్లు కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా బియ్యం, నోట్లు, కాయిన్స్​ జల్లెడ పడుతూ లెక్కింపు ప్రక్రియను సులువు చేస్తున్నారు. లెక్కింపులో బంగారు, వెండి, ఇతరత్రా కానుకలుకూడా బయటపడే అవకాశం ఉండగా.. పటిష్ట బందోబస్తు నడుమ లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. వారం నుంచి పది రోజుల్లోగానే లెక్కింపు మొత్తం పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Source link