ఏపీకి ఒకే రాజధాని – లోకేష్
“ఏపీకి ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ లు, ఈఎంసీ 1, 2, 3ల్లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం. అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీల ఫీడ్ బ్యాక్ ను మంత్రికి వివరించాను. మంత్రి వైష్ణవ్ గారు త్వరలో విశాఖ, తిరుపతిలలో పర్యటించి, గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు” అని లోకేశ్ వెల్లడించారు.