Janasena Party Latest News: వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ దృష్టిలో రాజకీయం అంటే భయపెట్టడం..బెదిరించడమే అని విమర్శించారు. తాజా పరిణామాలు చూస్తుంటే… ఏపీలో ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.