Sri Rama Pattabhishekam : భద్రాచలంలో శ్రీ రామ పట్టాభిషేకం వేడుక నేత్రపర్వంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవవర్మ ఈ వేడుకకు విచ్చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వేడుకలైన సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం వేడుకకు హాజరైన భక్తులు మధుర జ్ఞాపకాలతో వెనుదిరిగారు.