ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరు ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎంపికపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొదట్నుంచి రేసులో లేని విజయశాంతి… ఫైనల్ గా ఎలా సీటు దక్కించుకున్నారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. అయితే ఢిల్లీ పెద్దల ప్రమేయంతోనే లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.