TG MLC Elections 2025 : ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా

కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 3లక్షల 41 వేల 313మంది పట్టభద్రుల ఓటర్లు… 25 వేల 921 మంది టీచర్స్ ఓటర్లు ఉన్నారు. ఇటీవల కొత్తగా ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించగా 11056 మంది పట్టభద్రులు, 2148 మంది టీచర్లు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు.‌ అవి ఓకే అయితే పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 352369 కి చేరనుంది. అలాగే టీచర్ల ఓటర్లు 28069 మంది కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్తర తెలంగాణలోని 15 జిల్లాలో పట్టభద్రుల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్ల పోలింగ్ కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

Source link