మహా శివరాత్రి వేళ తెలంగాణ ఆర్టీసీ 3 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇందులో శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఉంటాయని పేర్కొంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండనున్నాయి.