Visakhapatnam : విశాఖలో ఘోరమైన సంఘటన జరిగింది. భార్యకు మత్తు మందు ఇచ్చి, మంటలు అంటుకునే పొడి శరీరంపై చల్లి హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ భర్త. గ్యాస్స్టవ్ ప్రమాదం జరిగిందని అందరిని నమ్మించాడు. ఆమె కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోవడంతో అసలు విషయం బయటపడింది.